Friday, October 18, 2024

Breaking: తల్లి మ‌ర‌ణం త‌ట్టుకోలేక ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య.. సూసైడ్ నోట్ ల‌భ్యం

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జ‌రిగింది. అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరూ కారణం కాద‌ని సూసైడ్ నోట్ రాసి ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దాయరా రాంపల్లి గ్రామానికి చెందిన యాదిరెడ్డి (34), మహిపాల్ రెడ్డి (29) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి గత 9 నెలల క్రితం వారి తల్లి ప్రేమిలా అనారోగ్యంతో మృతి చెందింది.

ఇది తట్టుకోలేని కొడుకులు కూడా త‌మ జీవితం చాలు అనుకున్నారు. చివరకు పెద్ద కొడుకు యాదిరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి చ‌నిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement