Sunday, October 20, 2024

Big Breaking | 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌స‌భ‌ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున‌ బదిలీలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ బదిలీలు అయ్యాయి. కాగా తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రెవెన్యూ, పోలీస్ తో పాటు మరిన్ని శాఖలో బదిలీలు జరిగే అవకాశాలున్నాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement