Saturday, September 21, 2024

తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ.. సజ్జల

రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ నేతలున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి చతికిలబడిందన్నారు. టీడీపీ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారన్నారు. ప్రజల ఆదరణ కోల్పోయి చంద్రబాబు చరిత్ర హీనులయ్యారన్నారు. ఎన్నికల్లో గెలవడానికి షార్ట్ కట్ ఉండదన్నారు. కకావికలమవుతున్న తమ్ముళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ చంద్రబాబునే పిలిచినట్లు కవరింగ్ ఇచ్చారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement