Sunday, September 8, 2024

Tamil Nadu: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 70 మందికి గాయాలు

ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 70మందికి గాయాలైన విషాద ఘటన తమిళనాడులోని కడలూర్‌లో చోటుచేసుకుంది. 2 ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..70 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడలూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఇవాళ కడలూర్‌ నుంచి వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు టైరు పేలిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది.

అదే సమయంలో పన్రుతి నుంచి కడలూర్‌ వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.70మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకి తీశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement