Thursday, October 17, 2024

Special Trains – రాముడి సేవ‌లో రైల్వే! ఆస్తా స్పెష‌ల్ పేరుతో జ‌ర్నీ

దేశంలో మరో మూడు రోజుల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. కోట్లాది మంది భారతీయులు ఎన్నో సంవ్స‌త‌రాలుగా ఎదురుస్తున్న అయోధ్య రామ మందిరం 22వ తేదీన‌ ప్రారంభం కానున్నది. రాముల వారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ చారిత్రక సన్నివేశంలో రైల్వే శాఖ భాగం పంచుకోనున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రామయ్య పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్‌ దీపాలతో అలంక‌రించ‌నున్నారు.

ఏపీ, త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌..
343 స్టేషన్లలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆంధ్రాలో 55 రైల్వేస్టేషన్లు ఉండగా, తమిళనాడులో 54 ఉన్నాయి. తర్వాతి స్థానంలో బీహార్‌ ఉన్నది. తెలంగాణలో రామగుండం, రామకృష్ణాపురం, రామన్నపేట, ఆంధ్రప్రదేశ్‌లో రామచంద్రాపురం, రామాపురం, కర్నాటకలో రామగిరి, రామనగరం, ఉత్తరప్రదేశ్‌లో రామచంద్రాపూర్‌, రామ్‌గంజ్‌, రామ్‌చౌరా రోడ్‌ ఇలా.. ఊరు పేరు చివర, ముందు రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ సుందరీకరించనున్నది.

ఆస్తా స్పెష‌ల్ పేరుతో ప్ర‌త్యేక రైళ్లు..
ఈ నెల 22వ తేదీన‌ రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆస్తా స్పెషల్‌ పేరుతో రైల్వే బోర్డు దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఆ తర్వాత వంద రోజులపాటు అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తు కోసం వెయ్యి రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రత్యేక రైళ్లలో రానుపోను టికెట్లను ఒకేసారి బుక్‌చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైళ్లు గమ్య స్థానం చేరేవరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా వెళ్లనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement