Sunday, September 8, 2024

Breaking: ర‌ష్యా – ఉక్రెయిన్ మ‌ధ్య చ‌ర్చ‌లు ప్రారంభం

గ‌త ఐదు రోజులు ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ యుద్ధం జ‌రుగుతోంది. అయితే ఈరోజు ఎట్ట‌కేల‌కు రెండు దేశాలు చ‌ర్చ‌ల‌కు ముందుకొచ్చాయి. అయితే వీరి భేటీ బెలార‌స్ కేంద్రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌త్య‌క్ష యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య కాసేప‌టి క్రితం చ‌ర్చ‌లు మొదల‌య్యాయి. బెలార‌స్‌లో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్గుగా అంత‌కుముందు బెలార‌స్ విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తున్న బెలార‌స్‌లో చ‌ర్చ‌ల‌కు తాము వ్య‌తిరేక‌మంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చ‌ర్చ‌ల‌కు తొలుత ర‌ష్యానే ప్ర‌తిపాద‌న చేయ‌గా.. అందుకు అంగీక‌రించిన జెలెన్‌స్కీ చ‌ర్చ‌ల‌ను బెలార‌స్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌లో జ‌రిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. అయితే ర‌ష్యా భీక‌ర దాడుల‌తో ఉక్రెయిన్‌లో ప‌రిస్థితి నానాటికీ విష‌మిస్తున్న నేప‌థ్యంలో బెలార‌స్‌లోనే చ‌ర్చ‌ల‌కు జెలెన్‌స్కీ అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే బెలార‌స్ కేంద్రంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం వెలువడుతుందన్న విష‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement