Friday, September 20, 2024

ఎల్బీన‌గ‌ర్ లో రూ.2,500కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు – మంత్రి ‘కేటీఆర్’

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఎల్బీన‌గ‌ర్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని తెలిపారు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. రూ. 2,500 కోట్ల‌తో ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద ముంపు నివార‌ణ‌కు రూ. వెయ్యి కోట్ల‌తో నాలాల అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలో మంచి నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు 12 రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించామ‌న్నారు. 353 కిలోమీట‌ర్ల మేర వాట‌ర్ పైపులైన్‌లు వేశామ‌న్నారు. ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. గ‌డ్డి అన్నారం మార్కెట్ స్థ‌లంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిని నిర్మిస్తామ‌న్నారు.

ఎల్బీన‌గ‌ర్‌లో భూ రిజిస్ట్రేష‌న్ స‌మ‌స్య కూడా ప‌రిష్కారిస్తామ‌ని హామీ ఇచ్చారు. కొత్త పెన్ష‌న్లు 2 నుంచి 3 నెల‌ల్లో అంద‌జేస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ (కుడివైపు), రూ. 28.642 కోట్లతో బైరామల్‌గూడ వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాగోల్, బండ్ల‌గూడ‌లో నాలా అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌హ‌ముద్ అలీతో పాటు ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement