Monday, September 16, 2024

Kamareddy: రెండు గ్రామాల్లో చిరుత సంచారం

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల మధ్య రెండు చిరుత పులులు సంచరిస్తున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు అధికారులు తెలిపారు. సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతంలోకి రావొద్దని సూచించారు. మద్దికుంట, రెడ్డిపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వ్యవసాయదారులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement