పాకిస్తాన్తో జరుగుతున్న వరల్డ్ కప్ రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ ఓటమి చెందింది. శుక్రవారం హైదరాబాద్లోని ఉప్పల్ స్డేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టును బౌలింగ్ పరంగా బాగానే కట్టడి చేసినా.. బ్యాటింగ్లో నెదర్లాండ్స్ అనుకున్న మేరకు ఆడలేకపోయింది. దీంతో 286 టార్గెట్ను ఛేదించే క్రమంలో కేవలం 205 పరుగులు మాత్రమే చేసి 41 ఓవర్లలోనే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసింది.
కాగా, ఈ మ్యాచ్లో ఓపెనర్ స్టార్ బ్యాటర్ విక్రమ్జిత్ సింగ్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బాస్ డీ లీడీ (67), ఎల్వాన్ బేక్ (28) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే వికెట్లు పోగొట్టుకుని పెవిలియన్ చేరారు. ఇందులో హరిస్ రవూఫ్ 2 వికెట్లు తీయగా.. షాహీన్ ఆఫ్రిదీ, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాబాద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.