Sunday, October 6, 2024

మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ

నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ముజీబుద్దిన్ ఈరోజు కేటీఆర్ తో సమావేశం అయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన నేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు.

ఈ‌ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కెసిఆర్ తమపై ఉంచిన పార్టీ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, హనుమంత్ షిండే, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement