Friday, October 18, 2024

క‌లెక్ట‌రేట్ లో మెరుపు స‌మ్మెకు దిగిన ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధ‌వ‌నేని ర‌ఘునంద‌న్ రావు సిద్దిపేట క‌లెక్ట‌రేట్ లో మెరుపు స‌మ్మెకు దిగారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను దుబ్బాక నియోజకవర్గంలో కేవలం టీఆర్ఎస్ సర్పంచ్ లకు మాత్రమే ఇస్తున్నార‌న్నారు. బీజేపీ సర్పంచ్ లకు ఇవ్వడం లేదన్నారు. అందుకే తాను సిద్దిపేట కలెక్టరేట్ లో సమ్మెకు దిగినట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే నిధులపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రైంది కాద‌న్నారు. త‌మ పార్టీ స‌ర్పంచుల‌కు ఒక లెక్క‌… టీఆర్ఎస్ స‌ర్పంచ్ ల‌కు ఒక లెక్కా అని రఘునందన్ రావు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement