Friday, October 18, 2024

మావోయిస్టుల చెర‌లో ఇంజ‌నీర్..భ‌ర్త‌ను విడిపించేందుకు బిడ్డ‌తో స‌హా అడ‌వుల బాట ప‌ట్టిన భార్య‌..

ఓ ఇంజ‌నీర్ ని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే అత‌న్ని విడిపించేందుకు అధికారులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఫ‌లితం ద‌క్క‌లేదు. దాంతో త‌న భ‌ర్త‌ను విడిపించుకునేందుకు ఇంజ‌నీర్ భార్య అడ‌విబాట ప‌ట్టింది. ఈసీన్ అంతా రోజా సినిమాని త‌ల‌పించేలా ఉంది. ఈ సంఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగింది. నవంబరు 11న పీఎంజీఎస్‌వై సబ్ ఇంజినీర్ అజయ్‌ రోషన్‌, అటెండర్‌ లక్ష్మణ్‌ కలిసి బీజాపూర్‌ జిల్లా, మాన్‌కేళి లోని ఘడ్‌ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని మావోయిస్టులు అపహరించుకుపోయారు. ఆ తరువాత నవంబరు 12వ తేదీన అడెండర్‌ లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. సబ్‌ ఇంజనీర్‌ను మాత్రం ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌ రోషన్‌ భార్య అర్పిత తన భర్తను విడిచి పెట్టాలని మావోయిస్టులను వేడుకుంది. ఈ క్రమంలో తన రెండేళ్ల కుమారుడితో కలిసి మావోయిస్టుల చెంతకు వెళ్ళేందుకు అడవి బాటపట్టింది. అజయ్‌ రోషన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని అతని భార్య, కుటుంబ సభ్యులు మావోలను వేడుకుంటున్నారు. మ‌రి మావోలు క‌నిక‌రిస్తారా..ఇంజ‌నీర్ క్షేమంగా బ‌య‌టికి వ‌స్తాడా అనేది ఉత్కంఠంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement