Tuesday, September 17, 2024

బిఆర్ఎస్ లో ఇక వారికే ప‌ద‌వులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కొన్నేళ్ళుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు ఈ సారి జరిగే ఎన్నికల నేపథ్యంలో ఆందోళన చెందకుండా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటు న్నారు. టిక్కెట్లు దక్కని సీనియర్లకు కీలక పదవులు ఇచ్చి గౌరవించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ జిల్లా బాద్యుల ద్వారా సమాచారం అందజేశారు. తెలంగాణలో ఒక ఉపా ధ్యాయ, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కానీ త్వరలో ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాలో మరో ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటికోసం కూడా పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు పోటీ- పడుతున్నారు. వచ్చేది అసెంబ్లిd ఎన్నికలు కావడంతో టిక్కెట్‌ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆశావహులు పార్టీ వదులుకోకుండా ఉం డేందుకు కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనూ కొంతమంది నేతలకు చాన్స్‌ ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు-గా తెలుస్తోంది. అదే సమ యంలో తమకు అవకాశం కల్పించాలంటూ కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్న సీనియర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్ని-కై-న వి. గంగాధర్‌ గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్‌కుమార్‌ల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమై డి.రాజేశ్వర్‌ రావు, ఫరూక్‌ హుస్సేన్‌ పదవీ కాలం మే నెల 27న ముగుస్తోంది. అయితే ఈ ఐదింటికి ఎన్నికల కమిషన్‌ ఇంకా షెడ్యూల్‌ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు నేరుగా రాజకీయ నియామకాలు కావడంతో ఎన్నికల ఏడాదిలో ఈ పదవులను ఆశిస్తున్న పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌ పెద్దల దగ్గర ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మెజారిటీ- టికెట్లని అధినేత కేసీఆర్‌ ఇప్పటికే సంకేతాలివ్వ డంతో ఈసారి టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలు ముందుగా ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకుని తర్వాత టికెట్ల కోసం ప్రయత్ని ంచవచ్చని భావిస్తున్నట్లు- తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాల్లో ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నవారిలో కొందరికి పదవి దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుం డడంతో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.

టిక్కెట్లు- ఇవ్వలేని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత
ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి పదవిని ఆచితూచి అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు- పార్టీ వర్గాలు పేర్కొంటు-న్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల పందేరం బీఆర్‌ఎస్లో రసవత్తరంగా మారింది. కేసీఆర్‌ ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లతో వీలైనంత వరకూ సీనియర్‌ నేతల అసమ్మతిని తగ్గించేందుకు ఉపయోగిం చుకుంటారని చెబుతున్నారు. ఖమ్మం లాంటి చోట్ల కొంత మందికి సీట్లను సర్దుబాటు- చేయడం కష్టంగా ఉంది. అలాంటి చోట.. ఎవరో ఒకర్ని ఒప్పించి.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కాలపరి మితి మార్చినెలాఖరుకే ముగియనుండటంతో వచ్చే నెల ప్రారంభంలోనే షెడ్యూల్‌ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement