Friday, October 18, 2024

దేశంలో కొత్తగా 30,948 మందికి కరోనా

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 30,948 మందికి వైరస్​ నిర్ధారణ కాగా.. 403 మంది మరణించారు. అదే సమయంలో 38,487 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,53,398 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దేశంలో శనివారం 15,85,681 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,60,06,588కు చేరింది. నిన్న 52,23,612 మందికి వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 58,14,89,377 టీకా డోసులు పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,24,24,234కు చేరింది.ఇందులో మొత్తం 3,16,36,469 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ మహమ్మారికి 4,34,367 మంది బలైయ్యారు. కేరళలో అత్యధికంగా 17,106 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4,575 కేసులు, తమిళనాడులో 1,652 కేసులు, కర్ణాటకలో 1,350 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 1,217 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాలు 83.68 శాతం ఉన్నాయి.

ఇది కూడా చదవండిః ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాః నారా లోకేశ్ ప్రతిజ్ఞ

Advertisement

తాజా వార్తలు

Advertisement