Tuesday, October 8, 2024

India Corona: భారత్ లో కరోనా విలయం.. ఒక్కరోజే 893 మంది మృతి

దేశంలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అయితే, గత రెండు రోజులు పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడం కలవరానికి గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,34,281 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 893 మంది కరోనాతో మరణించారు. దంతో ఇప్పటివరకు వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,52,784 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522 కు చేరింది. ఇందులో 3,87,13,494 వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,65,70,60,692 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement