Tuesday, October 1, 2024

కౌంటింగ్ షురూ…జాతకాలు మారిపోతాయి !!

ఏపీ లో మరికొన్ని గంటల్లో ఉత్కంఠతకు తెర పడనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దీంతో నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు కు కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలలో కౌంటింగ్ జరుగుతోంది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు, చిలకలూరిపేటలో కౌంటింగ్ కు రెడ్ సిగ్నల్ పడింది.

మొత్తం మున్సిపాలిటీలలో 1822 టేబుల్లు, కార్పొరేషన్ లలో 2204 టేబుల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లలో 2376 మందిని కౌంటింగ్ సూపర్ వైజర్ లను, 7412 మంది కౌంటింగ్ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 1941 మందిని మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్ లుగా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement