Friday, October 18, 2024

చివ‌రి శ్వాస వ‌ర‌కు పాక్ లోనే ఉంటా… ఇమ్రాన్ ఖాన్

తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్ళేది లేదని.. త‌న‌ చివరి శ్వాస వరకు పాకిస్తాన్ లోనే ఉంటానని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… పాకిస్తాన్ విపత్తు వైపు వెళుతుందని, అది దేశ విచ్చిన్నానికి దారి తీయవచ్చన్నారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికలు నిర్వహించడమే మార్గమ‌న్నారు. దేశం నుంచి పరారై లండన్ లో ఉంటున్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు దేశ రాజ్యంగం గురించి ఆలోచిస్తున్నారా..? అని ప్రశ్నించారు. తాను ఆర్మీని విమర్శించడం అంటే తన పిల్లలను మందలించినట్లేనని వ్యాఖ్యానించారు. తాజా సర్వేలో 70శాతం మంది ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement