Thursday, September 19, 2024

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మోడీ పర్యటనలో ఉన్నంత సేపు మూడంచెల భద్రత కేటాయించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు భద్రతను ఏర్పాటు చేస్తారు. రాజ్ భవన్ లో మోడీ బసపై ఎస్పీజీ నిర్ణయం తీసుకోనున్నారు. రాజ్ భవన్ లో బస చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement