Friday, October 11, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ‘శ్యాం సింగ రాయ్’ చిత్ర‌ బృందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రసాసన్ నగర్ లోని జిహెచ్ ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు హీరో నాని,హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్…ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి అని పిలుపునిచ్చారు.ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.

సినిమా ఇండస్ట్రీ,రాజకీయ నాయకులు అందరూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.ఈ కార్యక్రమంతో ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు. గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దోహదపడుతుందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని నాని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమం అనంతరం గ్రీన్ఇండియా ఛాలెంజ్ కరుణాకర్ రెడ్డి,రాఘవ వృకవేదం పుస్తకాన్ని హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి కి అందజేశారు.ప్రకృతిపై ప్రేమతో వేదాలతో కూడిన వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్ కుమార్ పై నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రశంసల జల్లు కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement