తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎంఎస్ రామచంద్ర రావు అనే సీనియర్ న్యాయవాదిని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాజ్యాంగం రూపొందించిన ఆర్టికల్ 223 ప్రకారం ఎంఎస్ రామచంద్ర రావును తాత్కాలిక జడ్జిగా నియమిస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న జడ్జి హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సర్కారు తెలిపింది. కాగా తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీకి పలువురు న్యాయవాదులు వీడ్కోలు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ హిమా కోహ్లీకి న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్ హిమా కోహ్లీకి బార్ అసోసియేషన్ వీడ్కోలు ఏర్పాటు చేసింది.
ఈ వార్త కూడా చదవండి: కేంద్రానికి తెలంగాణ సర్కార్ మరో లేఖ