మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాం తంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరి గిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వ హిస్తున్న సమయంలో మావో యిస్టులు తారసపడ్డారు.
దీంతో అప్రమత్తమైన పోలీ సులు, మావోయిస్టులు పరస్ప రం కాల్పులు జరిపారు. ఉద యం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. అనం తరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదే హాల ను పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవ కాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఎదురు కా ల్పుల్లో ముగ్గురు జవాన్లకు కూడా గాయాలయ్యాయని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గో యల్ తెలిపారు.