Tuesday, September 17, 2024

Assembly Election జమ్ము కశ్మీర్ లో ఎన్నికల నగరా

జమ్ము కశ్మీర్ లో ఎన్నికల నగరా
మూడు దశలలో పోలింగ్
సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీలో ఎన్నికలు
హర్యానా అసెంబ్లీకి సైతం…
అక్టోబర్ ఒకటో తేదిన పోలింగ్
హ‌ర్యానా అసెంబ్లీకి ముగిసిన ప‌ద‌వీకాలం
జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్నిక‌ల‌కు అనుకూలం వాతావ‌ర‌ణం
ఇప్ప‌టికే పొలిటిక‌ల్ పార్టీల‌తో భేటీ అయిన ఈసీ బృందం
సానుకూల‌త ఉండ‌డంతో పోలింగ్‌కు తేదీల ప్రకటన

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్‌: లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శుక్ర‌వారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాకు నేడు వివరాలుతెలిపారు. .

హర్యానకు ఎన్నికలు …

హర్యానా విధానసభ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలచేశారు. . అక్టోబర్ 1వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెలువరిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌, లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే కమిషన్‌ బృందం లోయను సందర్శించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తీసుకుంది.

- Advertisement -

మూడు దశలలో జ‌మ్ము క‌శ్మీర్‌కు ఎన్నిక‌లు

మ‌రోవైపు ఇటీవ‌ల ముగిసిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌మ్మూ క‌శ్మీర్‌లో 58.58 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డంపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. మూడునాలుగు దశాబ్దాల్లో ఈసారే కశ్మీర్‌లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. కాగా, గతంలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో 107 స్థానాలుండగా ఇప్పుడు 114కు పెరిగాయి. వీటిలో 24 సీట్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో జమ్ము ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్‌ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి. ఇక జమ్ము కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement