Sunday, September 8, 2024

ఘోర రోడ్డుప్ర‌మాదం.. చిన్నారి స‌హా 9మంది మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో చిన్నారి స‌హా 9మంది మృతిచెందిన విషాద ఘ‌ట‌న ముంబై-గోవా హైవేలో ఈ ఉదయం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఈ ఉదయం 5 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ట్రక్కు ముంబైకి, కారు రత్నగిరి జిల్లాలోని గుహాగర్ కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయిందని వివరించారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement