Thursday, September 19, 2024

TG: చిన్నారిని చిదిమేసిన స్కూల్ బ‌స్సు..

ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థిని స్పాట్ డెడ్‌
మ‌ల్లంపేట‌లో దుర్ఘ‌ట‌న


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి మ‌హ‌న్విత‌(5)పై స్కూల్ బ‌స్సు వెళ్ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన దుర్ఘ‌ట‌న ప‌లువురిని క‌ల‌చివేసింది. స్కూల్ బ‌స్సు నుంచి కింద‌కు జారి టైర్ల కింద‌ప‌డింది.

తీవ్రంగా గాయ‌ప‌డిన బాలిక అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement