Saturday, September 21, 2024

FLASH: విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురి మృతి

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో హృదయ విదారక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఔరంగాబాద్ జిల్లా రఫీగంజ్ బ్లాక్ కస్మా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని చిరాయిలా గ్రామంలో ఆరుగురు బాలికలు కలిసి విషం తాగారు. వీరిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, ముగ్గురు బాలికల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికలందరూ స్నేహితులని తెలిపారు. బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని చెప్పారు. వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అమ్మాయిలు విషం ఎందుకు తాగారన్న దానిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement