ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫొన్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. దాన్ని చేతిలో పట్టుకుని స్టేటస్గా కూడా ఫీల్ అవుతుంటారు. అయితే అన్ని కంపెనీల ఫోన్ల కంటే ఆపిల్ ఐఫోన్ చాలా ఖరీదు ఉంటాయి. అందుకే సామాన్యులు దీన్ని కొనడానికి కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. అయితే బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలనుకునే వారికి సంస్థ గుడ్ న్యూస్ చెబుతోంది. బఢ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చే ఎస్ఈ మోడల్స్ లో కొత్త ఫోన్ విడుదలపై కసరత్తు చేస్తోంది. ఐఫోన్ ఎస్ఈ3 (2022) పేరుతో మార్కెట్లోకి విడుదల కానుంది.
అయితే ప్రొడక్షన్ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురైతే విడుదల తేదీని ఇంకాస్త ముందుకు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమచారం ప్రకారం.. మార్చి ఫ్రారంభంలోనే ఈ కొత్త మోడల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. 2020 తర్వాత వస్తున్న ఎస్ఈ మోడల్ ఇదే కావడం గమనార్హం.
ఎస్ఈ3 మోడల్ ప్రత్యేకతలు..
ఐఫోన్ ఎస్ఈ3ని పూర్తిస్థాయి అప్డేటెడ్ వెర్షన్గా విడుదల చేస్తోంది యాపిల్ కంపెనీ. ఇక ఈ మోడల్ 5జీతో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఫోన్ చూసేందుకు ఎస్ఈ2 మాదిరిగానే ఉండొచ్చు అంటున్నారు టెక్ అనలిస్టులు. కెమెరా, ప్రాసెసర్ విషయంలోనూ భారీగా మార్పులు చేసినట్లు సమాచారం. యాపిల్ సొంత చిప్సెట్ అయిన .. ఏ15 బయోనిక్ చిప్తో ఎస్ఈ3 రానుంది. 3జీబీ ర్యామ్తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశలున్నాయి.
ఐఫోన్ ఎస్3 ధర దాదాపు 300 డాలర్లు అంటే.. రూ.22,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టెక్ ఎక్స్పర్ట్స్.. అయితే ఐపోన్ ఎస్ఈ3 విడుదల తేదీపై యాపిల్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.