Saturday, September 28, 2024

మహిళలకు మద్దతు తెలిపే పురుషులు మంచోళ్లన్న ఉపాసన

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పలు సామాజిక అంశాలతో పాటు, ఆరోగ్య కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని. ఉపాసన సేవలకు గాను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అత్యంత ప్రభావవంతమైన మహిళగా గుర్తించింది ఎఫ్ ఎల్ వో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం. తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాసనను ఎంపిక చేసి అవార్డు అందించింది ఈ సంస్థ.

తనకు ఈ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేసిన ఉపాసన మహిళలకు మద్దతుగా ఉండే పురుషులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపింది. తన భార్య, తల్లి, సోదరి, కూతురు, కోడలు, మనవరాలికి జీవితాల్లో వెలుగులు నింపే ప్రతి పురుషుడికి ఈ అవార్డు అంకిత మని ట్వీట్ చేసింది ఉపాసన. పురుషులకు మద్దతు ఉండే మహిళలు సానుకూల దృక్పథంతో విజయాలు సాధిస్తూ ఉంటారని ఉపాసన పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement