MBNR | ప్రభుత్వ సంక్షేమ పథకాల డొల్లతనం ప్రజలకు వివరించాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, జూన్ 18(ఆంధ్రప్రభ) : కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల డొల్లతనం ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఉమ్మడి పెబ్బేరు (PEBBAIR) మండలం ముఖ్యనాయకులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఆయన స్వగృహంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) వ్యవహరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, ఆయా గ్రామాల నాయకులను పలకరిస్తూ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.

నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదని, ఐకమత్యంగా ఉండి పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్, మండల అధ్యక్షులు వనం.రాములు, వెంకటస్వామి, కర్రెస్వామి, రంగాపురం.కృష్ణారెడ్డి, పెద్దింటి.వెంకటేష్, దిలీప్ రెడ్డి, జగన్నాథం నాయుడు, పృథ్వీనాథ్, ఎం.రాజశేఖర్, మాధవ్ రెడ్డి, సత్యారెడ్డి, ఎల్లారెడ్డి, యాపర్ల.ఆనంద్, వడ్డే.ఈశ్వర్, గోవిందు నాయుడు, వడ్డే.రమేష్, పరమేశ్ నాయి, చిట్యాల.రాము మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply