హైదరాబాద్ – అసెంబ్లీ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో అసెంబ్లీలోని ఎల్పీ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేధికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ ఎస్ నేతలను కోరారు..
అలాగే ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించారు. ఈ బిల్లుపై బిఆర్ ఎస్ సభలో బిసిల తరుపుల గళం వినిపించాలని కోరారు. బిసిలకు రిజర్వేషన్ పెంచేందుకు అసెంబ్లీలో బిఆర్ ఎస్ నేతలు తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.