TG | బాపు మీద ఈగ వాలితే స‌హించేది లేదు – ఎమ్మెల్సీ క‌విత

హైద‌రాబాద్ – జాగృతి పుట్టింది ఇద్దరు వ్యక్తుల స్ఫూర్తితోనని అన్నారు ఎమ్మెల్సీ క‌విత‌. అందులో ఒకరు కేసీఆర్ అని.. రెండో వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. ఆనాడు మేధావులు తెలంగాణ జాగృతి అని తన సంస్థకు పేరు పెడతామంటే వద్దన్నారని.. ముందు తెలంగాణ అని పేరు ఉంటే తొక్కేస్తారని అన్నారని గుర్తు చేశారు. కానీ, ఆంధ్రా పాలకులను ఎదుర్కొని ధైర్యంగా తెలంగాణ జాగృతిని స్థాపించిన వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లామని అన్నారు.

బంజారాహిల్స్‌లో తన ఇంటి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నేడు ఆమె ప్రారంభించారు. అనంతరం కవిత జై తెలంగాణ, జై జాగృతి అంటూ మీడియాతో ఆమె మాట్లాడుతూ, . తెలంగాణ గొంతుకలా.. తలలో నాలుకలా జాగృతి నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆడబిడ్డలా బోనం, బతుకమ్మను ఎత్తానని తెలిపారు. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసిందని అన్నారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారని పేర్కొన్నారు. ఎప్పుడు ఏం అడిగినా వెంటనే జీవో ఇచ్చేవారని తెలిపారు.

ఉద్య‌మ కారుల‌పై గ‌న్ ప‌ట్టిన వ్య‌క్తి సిఎంగానా..

ఉద్యమకారులపై గన్ తీసుకెళ్లిన వాళ్లు రాష్ట్రానికి సీఎం అయ్యారని ఫైర్ అయ్యారు క‌విత . యువ వికాసం పథకానికి రాజీవ్ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటని కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలని అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను 18 ఏళ్ల క్రితం స్థాపించామని, ప్రతి ఉద్యమంలో జాగృతి భాగస్వామిగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాళేశ్వ‌రం విష‌యంలో కెసిఆర్ కు నోటీస్ ఇవ్వ‌డం అంటే యావ‌త్ తెలంగాణ సమాజానికి ఇవ్వ‌డ‌మే న‌న్నారు.. దీనికి నిర‌స‌న‌గా ఈ నెల 4వ తేదిన ధ‌ర్నా చేస్తున్నామ‌న్నారు.. కెసిఆర్ మీద ఈగ వాలినా స‌హించ‌బోన‌ని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *