TG | ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

TG | ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • మేడారం బస్సులు ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే,జి ఎస్ ఆర్.

TG | చిట్యాల, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క – సారలమ్మ, మహాజాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఈ రోజు చిట్యాల మండల కేంద్రాలల్లో మేడారం వెళ్ళే బస్సు పాయింట్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్, ప్రజా ప్రతినిధులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరకాల డిపో నుండి మొత్తం 160 బస్సు సర్వీసులు మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. చిట్యాల నుండి 30 బస్సులు, జాతరకు వెళ్ళే భక్తులు ఆర్టీసీ సేవలు తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు. భక్తులకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. టేకుమట్ల మండల కేంద్రం నుండి కూడా బస్సు సర్వీసులు మేడారం కు నడిచేలా చూడాలని ఎమ్మెల్యే గండ్ర డీఎం కు సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామ సర్పంచ్ తవటం లక్ష్మి , చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply