Monday, October 21, 2024

WTC Table | తొలి టెట్టులో విజ‌యం.. నాల్గో ప్లేస్‌లో న్యూజిలాండ్ !

భారత్ – న్యూజిలాండ్ మధ్య జ‌రుగుతున్న‌ మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజుతో తొలి టెస్టు ముగిసింది. కాగా, టీమిండియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కివీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (2023-25) పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఇక‌, పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా (62.50), మూడో స్థానంలో శ్రీలంక (55.56) ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మరో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రెండో టెస్టులోనూ కివీస్ జట్టుపై టీమిండియా ఓడిపోతే పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు పడిపోతుంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement