Friday, September 13, 2024

Archary – గురి తప్పిన బాణం – క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మన అమ్మాయిలు ఓటమి

ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళా ఆర్చ‌ర్ల బృందం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఆదివారం జరిగిన టీమ్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో దారుణంగా ఓడింది. త‌మ కంటే త‌క్కువ ర్యాంక‌ర్ నెద‌ర్లాండ్స్ జ‌ట్టు చేతిలో 0-6తో కంగుతిన్న‌ది. సీనియ‌ర్ ఆర్చ‌ర్ దీపికా కుమార్ , భ‌జ‌న్ కౌర్ , అంకిత భ‌క‌త్‌లతో కూడిన భార‌త‌ బృందం క్వార్ట‌ర్స్‌లో తేలిపోయింది.

క్వాలిఫ‌యింగ్ రౌండ్స్‌లో మెరిసిన అంకిత కీల‌క పోరులో స‌రిగ్గా గురి చూడ‌లేక‌పోయింది. భార‌త ఆర్చ‌ర్ల‌లో భ‌జ‌న్ కౌర్ వ‌రుస‌గా 10, 9 పాయింట్లు గెలిచి ఆశ‌లు రేపింది. కానీ, దీపిక‌, అంకిత‌లు మాత్రం నిల‌క‌డ‌గా గురి చూసి బాణం విస‌ర‌లేక‌పోయారు.

ఈ ఇద్ద‌రూ మ‌రీ ఆధ్వాన్నంగా 4, 6 పాయింట్ల‌తో అంద‌ర్నీ షాక్‌కు గురి చేశారు. మ‌రోవైపు డ‌చ్ త్ర‌యం క్వింటీ రొఫ్ఫెన్, గాబి స్కొలెస్స‌ర్, లారా వాన్ డెర్ వింకెల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. మూడు రౌండ్ల‌లో వెన‌క‌బ‌డిన భార‌త ఆర్చ‌రీ త్ర‌యం 51-52, 49-54, 48-54తో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement