Thursday, September 19, 2024

Wimbledon | ఫైన‌ల్లో జాస్మిన్‌, బార్బోరా..

ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిని చరిత్ర సృష్టించింది. ఈరోజు జరిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో డోనా వెకిక్‌పై 2-6, 6-4, 7-6 తేడాతో విజయం సాధించి వింబుల్డన్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీంతో మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా రికార్డు సృష్టించింది.

ఇక‌ రెండో సెమీ ఫైనల్‌లో బార్బోరా క్రెజ్‌సికోవా, ఎలెనా రిబాకినా పోటీపడ్డారు. కాగా, ఈ మ్యాచ్‌లో రిబాకినాపై 3–6, 6–3, 6–4 తేడాతో క్రెజ్‌సికోవా విజయం సాధించింది. ఇక ఇక 13న జ‌ర‌గ‌నున్న‌ టైటిల్ పోరులో జాస్మిన్ పావోలిని – బార్బోరా క్రెజ్‌సికోవా తలపడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement