Friday, October 18, 2024

VVS Laxman: శ్రీవారి సేవలో వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబం

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆలయ పుష్పాలంకరణకు పుష్పాలను విరాళం అందజేశారు.

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి ఆలయానికి చేపట్టిన మూడో విడత పుష్పాలంకరణకు రూ. 15 లక్షల విలువైన పుష్పాలను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు ఈ విరాళాన్ని అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణ జరగ్గా ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ప్రాంగణాలకు పుష్పాలంకరణ చేసేందుకు ఫ్లవర్స్ ను మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement