Monday, September 23, 2024

BCCI | ఎన్‌సీఏ చీఫ్‌గా లక్ష్మణ్..

జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పదవీ కాలం సెప్టెంబర్‌తో ముగియనుంది. అతడి సేవలను మరికొంతకాలం వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది. కొద్ది రోజుల్లో ఎన్‌సీఏ కొత్త క్యాంపస్‌ ప్రారంభం కానుంది. దీంతో మరో ఏడాదిపాటు లక్ష్మణ్‌నే చీఫ్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు లక్ష్మణ్‌ సేవలను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఒకటి వినియోగించుకోవాలని భావిస్తోందట. కానీ, ఎన్‌సీఏ చీఫ్‌గా ఉన్నంత వరకూ ఫ్రాంచైజీ క్రికెట్‌ వైపు వెళ్లేందుకు అవకాశం ఉండదు… దీనిపై ల‌క్ష్మ ణ్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లు టాక్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement