Sunday, September 15, 2024

Virat kohli | మ‌న కోహ్లీ చాలా కాస్ట్లీ గురూ..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత విలువైన భారత సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ క్రోల్ 2023 నివేదిక ప్రకారం కోహ్లీ ప్రస్తుత బ్రాండ్ వాల్యూ రూ.1901 కోట్లు గా ఉంది. గతేడాది(2022)తో పోలిస్తే కోహ్లీ విలువ 29 శాతం పెరగడం విశేషం.

- Advertisement -

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్(రూ.1693 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.1001 కోట్లు) అధిగమించాడు. దాంతో భారత్‌లోనే అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. ఈ జాబితాలో 2017 నుంచి అగ్రస్థానంలోనే కొనసాగిన కోహ్లీ.. 2022లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం ఆరు సార్లు భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు.

మోస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగిన భారత క్రికెటర్లలో కోహ్లీ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement