Sunday, September 8, 2024

ICC T 20 : దాయాదుల మ్యాచ్ కు అంపైర్లు వీరే….

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇప్పటి నుంచే సెగ మొదలైంది. జూన్ 1 నుంచి ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. దీంతో ఒక్కసారి మ్యాచ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అయిపోయాయి.

ఈ నేపథ్యంలో అసలు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు అంపైర్లు ఎవరున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఇంతకీ వారెవరంటే రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్ గా క్రిస్ గఫానీ, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ ఉండనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement