Thursday, September 19, 2024

Team India | శ్రీలంకలో టీమిండియా పర్యటన… షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా… ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటన తర్వాత శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ పర్యటన కోసం టీమ్ ఇండియా షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది.

జూలై 26, 27, 29 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు, ఆగస్టు 1, 4, 7 తేదీల్లో వన్డేలు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. అయితే, ఇప్పుడు షెడ్యూల్‌ను సవరించారు. జూలై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు, ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement