Tuesday, September 17, 2024

IND vs AFG | ఆదుకున్న సూర్య… ఆఫ్ఘన్ ముందు బిగ్ టార్గెట్..

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భాగంగా నేడు జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా బిగ్ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కీల‌క వికెట్లు కోల్పోయినా.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకోవడంతో భారీ స్కోర్ చేయగలిగింది.

రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన పంత్ (20), విరాట్ కోహ్లీ (24), పరుగులకు అవుట్ అయ్యారు. ఆ తరువాత సూర్కకుమార్ యాదవ్ (53) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా 32 పరుగులతో రాణించాడు. ఇక ఆఖర్లో (6 బంతుల్లో 12 పరుగులు) ఆకట్టుకున్నాడు. దీంతో ఆఫ్ఘన్ 182 పరుగుల టార్గెట్‌తో బరాలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement