Friday, October 18, 2024

Sports – ఒలింపిక్స్ భార‌త‌ బృందానికి స్పాన్స‌ర్ గా ఆదాని గ్రూప్

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా కార్పొరేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ (Adani వ్యవహరిస్తుందని సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో #DeshkaGeetAtOlympics పేరిట వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు. దీంతోపాటు 1.45 నిమిషాల నిడివి గల ఓ వీడియోను కూడా సిద్ధం చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన అథ్లెట్లు శ్రమిస్తున్న వీడియోలు ఉన్నాయి..

26 నుంచి క్రీడా సంబ‌రం …

ఈనెల 26 నుంచే పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా వీటికి సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈసారి ఒలింపిక్స్‌లో పోటీపడే అథ్లెట్ల సంఖ్య తగ్గింది. షెడ్యూల్‌ ప్రకారం 2020లో కాకుండా కొవిడ్‌ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతానికి పారిస్‌లో పోటీపడబోతున్న అథ్లెట్ల సంఖ్య 113 మందికి ప‌రిమిత‌మైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement