Friday, October 18, 2024

Denmark Open | క్వార్టర్స్‌లో సింధు ఓట‌మి.. ముగిసిన భార‌త పోరు !

డెన్మార్క్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ ప్రయాణం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు 13-21, 21-16, 9-21 తేడాతో ఐదో సీడ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గ్రెగోరియా మార్సికా టన్‌జంగ్‌ (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలైంది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో పుంజుకుంది. వరుస స్మాష్‌లతో ఆకట్టుకున్న సింధు రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. కానీ, ఆ తర్వాత నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో మాత్రం తెలుగుతేజం పూర్తిగా విఫలమైంది. దీంతో డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత్‌ పోరాటం సమాప్తమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement