Friday, September 20, 2024

Shikhar Dhawan | మైదానంలోకి గ‌బ్బ‌ర్ రీఎంట్రీ..

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. జీవితంలో తర్వాతి పేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని చెప్పాడు. అయితే, రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. మళ్లీ రంగంలోకి దిగుతానని ప్రకటించాడు. ఆట తనలో విడదీయరాని భాగమని, ఇప్పటికీ తన శరీరం క్రికెట్ కు సహకరిస్తుందని చెప్పాడు. అందుకే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో పాల్గొంటానని ప్రకటించాడు. మైదానంలో తన స్నేహితులతో మళ్లీ కలుసుకోనున్నానని, అభిమానులకు కొత్త జ్ఞాపకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నానని ధావన్ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement