Thursday, September 19, 2024

Duleep Trophy | ములాని అదుర్స్… టీమ్ – ఏ స్కోర్ ఎంతంటే !

ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నమెంట్ ఈ రోజు మ్యాచ్‌లో ఇండియా ఏ.. జ‌ట్టు నిల‌క‌డ‌గా ఆడుతొంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ… యువ‌ ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ (88 పరుగులతో నాటౌట్‌) అద‌ర‌గొట్టాడు. అత‌నికి తోడుగా.. తనుష్ కోటియన్ కూడా (53) హాఫ్ సెంచరీతో ఆక‌ట్టుకున్నాడు.

రియాన్ పరాగ్ (37), కుమార్ కుశాగ్రా (28) రాణించారు. ఇక ఇండియా డి బౌల‌ర్ల‌లో హర్షిత్ రాణా, విద్వాత్ కావరప్ప, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా… శరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ ఒక్కో వికెట్ ద‌క్కించుకున్నారు. దీంతో ఇండియా ఏ జ‌ట్టు రెండో రౌండ్ తొలి రోజు ఆట ముగిసేస‌రికి 82 ఓవ‌ర్ల‌లో 288/8 స్కోర్ సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement