Saturday, September 21, 2024

IPL | స్పీడ్​ పెంచిన పంజాబ్​.. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

ఐపీఎల్​లో భాగంగా ఇవ్వాల (బుధవారం) రాత్రి మొహాలీలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. పాయింట్ల పట్టికలో ముంబై కంటే ఓ మెట్టు (ఆరో స్థానం) పైనున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా రెండో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై మాత్రం ఒకటి రెండు స్థానాలు మాత్రమే మెరుగుపరుచుకోగలుగుతుంది. ఓడితే మాత్రం కిందికి దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం.

ఇక.. బ్యాటింగ్​లో పంజాబ్​ కింగ్స్​ దూకుడు పెంచింది. ఓపెనర్​ ప్రభుసిమ్రన్​సింగ్ (9),​ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా శిఖర్​ ధవన్ (30)​ దంచికొట్టాడు .. అదే దారిలో మ్యాథ్యూ (27) ఆడాడు.. ఇక మూడు వికెట్లు కోల్పోయినా లివింగ్​స్టోన్ 82, జితేశ్​ శర్మ 49 స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు.  దీంతో పంజాబ్​ నిర్ణీత ఓవర్లలో 214 పరుగులు చేసింది. ఇక ముంబయి జట్టు ‌‌215 పరుగుల టార్గెట్​తో చేజింగ్​ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement