Tuesday, September 17, 2024

Paris Olympics – టెన్సిస్ లో ముగిసిన భార‌త ప్ర‌స్థానం

భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌, డబుల్స్‌లో భారత్‌ ఆటను మొదలు పెట్టింది. సింగిల్స్‌ లో సుమిత్ నాగల్, డబుల్స్‌లో బోపన్న – బాలాజీ జోడీ రంగంలోకి దిగింది. ఈ రెండింటిలోనూ భారత్ ప్రయాణం తొలి రౌండ్‌లోనే ముగిసింది. నాగల్ ఫ్రాన్స్‌కు చెందిన కొరెంటిన్ మౌటెట్‌తో ఓడిపోగా., బోపన్న – బాలాజీ జోడీ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్‌ఫిల్స్, ఎడ్వర్డ్ రోజర్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

తొలి రౌండ్‌లో బోపన్న, బాలాజీ జోడీని మోన్‌ఫిల్స్‌, వాసెలిన్‌ జోడీ చేతిలో 7-5, 6-2 తో వరుస సెట్లలలో ఓడింది. డబుల్స్‌ లో భారత్‌ క్యాంపెయిన్‌ 76 నిమిషాల్లో ముగిసింది. తొలి సెట్‌లో ఫ్రెంచ్ జోడీకి బోపన్న, బాలాజీ గట్టిపోటీని అందించగా., రెండో సెట్‌ లో భారత జోడీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. చివరి క్షణంలో గాయపడిన ఫాబియన్ రెబల్ స్థానంలో వచ్చిన మోన్‌ఫిల్స్.. అద్భుతాలు చేశాడు. బోపన్నను సుదీర్ఘ ర్యాలీలో నిమగ్నం చేయాలనే ఫ్రాన్స్ వ్యూహం విజయవంతమైంది. దాని కారణంగా బాలాజీని పక్కన పెట్టారు. భారత జట్టు వెస్లిన్ సర్వీస్‌ ను బ్రేక్ చేసింది. అయితే ఈ జోరును కొనసాగించలేకపోయింది. దాంతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement