Wednesday, September 18, 2024

Paris Olympics – Hockey – బెల్జియం చేతిలో భార‌త్ ఓట‌మి…

పారిస్ ఒలింపిక్స్ లో కఠినమైన గ్రూప్ లో ఉన్న టీం ఇండియా ఈ రోజు బెల్జియంతో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో 1-2 తేడాతో ఓడిపోయింది. మొదటి హాఫ్ లో గోల్ చేసి 1-0 తో లీడ్ లో ఇండియానే ఆధిక్యంలో ఉన్నా టోక్యో మెడ‌లిస్ట్ బెల్జియం అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. భార‌త్ త‌ర‌పున అభిషేక్ ఒక్క‌డే గోల్ చేశాడు. తొలి రెండు క్వార్ట‌ర్ల‌లో భార‌త్ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కీల‌క‌మైన చివ‌రి రెండు క్వార్ట‌ర్స్‌లో బెల్జియం ఆట‌గాళ్లు జోరు పెంచారు. రాజ్ కుమార్ పాల్‌కు ఎల్లో కార్డు ఇవ్వ‌డం వ‌ల్ల‌.. చివ‌రి నిమిషాల్లో ఒక ఆట‌గాడు లేకుండానే ఇండియా ఆడాల్సి వ‌చ్చింది. ఇక ఓవరాల్ గా ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా రెండు విజయాలు సాధించి.. ఓ మ్యాచ్ డ్రా సీగేసుకొని ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. ఇక గ్రూప్ స్టేజ్ లో తమ లాస్ట్ మ్యాచ్ ను భారత్ ఆస్టేలియా జట్టుతో రేపు ఆడనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement