Thursday, September 19, 2024

Paris Olympics – ఈసారి గురి కుదిరింది .. అర్చ‌రీ క్వార్ట‌ర్ పైన‌ల్స్ ధీర‌జ్, అంకిత‌

పారిస్‌ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బొమ్మదేవర ధీరజ్ . అంకిత భకత్‌తో కలిసి క్వార్టర్స్‌ పోరుకు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మన జోడి.. ఇండోనేషియా ద్వయం ఆరిఫ్‌-కోరునిసాపై 5-1తో విజయం సాధించింది. ఈ సాయంత్రమే ఆర్చరీ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ క్వార్టర్స్‌ ఫైనల్‌ జరగనుంది. ఇందులో ధీరజ్‌-అంకిత జోడి స్పెయిన్‌ లేదా చైనా ద్వయంతో తలపడే అవకాశముంది.

ఇక, ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనుబాకర్‌ మూడో విభాగంలో పోటీపడుతోంది. షూటింగ్‌ మహిళల 25మీ. పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరు శుక్రవారం జరుగుతోంది. ఇందులో మనుబాకర్‌తో పాటు మరో షూటర్‌ ఇషాసింగ్‌ బరిలో ఉంది. క్వాలిఫికేషన్‌లో టాప్‌ 8లో నిలిచినవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement