Thursday, September 19, 2024

BCCI | దులీప్ ట్రోఫీలో కొత్త ప్లేయ‌ర్లు !

దేశవాలీ క్రికెట్ టోర్నీ దులీప్‌ ట్రోఫీ 2024 రెండో రౌండ్ మ్యాచులు సెప్టెంబ‌ర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతూ….. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లు తమ తమ జట్లను వీడనున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ఆట‌గాళ్ల స్థానాల్లో మ‌రికొంద‌రు ప్లేయ‌ర్ల‌ను బీసీసీఐ ఎంపిక‌ చేసింది.

అప్‌డేటెడ్ జ‌ట్లు…

ఇండియా-ఏ జట్టు : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుషాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, ఎస్కే రషీద్, ఆకిబ్ ఖాన్.

ఇండియా-బి జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీప‌ర్‌), సుయాష్ ప్రభుదేస్ సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీప‌ర్‌).

ఇండియా-సి జ‌ట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

ఇండియా-డి జట్టు : శ్రేయాస్ అయ్య‌ర్ (కెప్టెన్‌), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్ (వికెట్ కీప‌ర్‌), సౌరబ్ కుమార్‌, సంజూ శాంస‌న్ (వికెట్ కీప‌ర్‌), నిశాంత్ సింధు, విద్వాత్ కవేరప్ప.

Advertisement

తాజా వార్తలు

Advertisement