Saturday, September 14, 2024

Duleep Trophy | మూషీర్ ఖాన్ సెంచ‌రీ…

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో నేడు ఇండియా ఏ – ఇండియా బీ జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-బీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగులు బాదింది. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ త‌మ్ముడు ముషీర్ ఖాన్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 10 ఫోర్లు, రెండు సిక్సులతో 105తో క‌దం తొక్కాడు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. ముషీర్ ఖాన్ కు తోడుగా నవదీప్ సైనీ (29) వికెట్ నష్టపోకుండా నిలకడగా ఆడాడు.

ఇక‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (59 బంతుల్లో 30), అభిమన్యు ఈశ్వర్ (42 బంతుల్లో 13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (9), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(0), వాష్టింగన్ సుందర్(0), సాయి కిషోర్(1) దారుణంగా విఫలమయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement